కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్నాయి?

దేశంలో కొవిడ్-19 కేసులు విస్తృతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్లు వేగంగా వ్యాప్తి చెందడం సార్వత్రిక ప్రమాదాన్ని రేకెత్తిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్షియం (ఇన్సాకోగ్) తాజా డేటా ప్రకారం, NB.1.8.1 మరియు LF.7 అనే రెండు కొత్త వేరియంట్లు దేశంలో గుర్తించబడ్డాయి. ఈ రెండు వేరియంట్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ‘వేరియంట్స్ అండర్ మానిటరింగ్’ గా వర్గీకరించింది.

NB.1.8.1 వేరియంట్ కేసు ఏప్రిల్ నెలలో తమిళనాడులో నమోదై, మేలో LF.7 వేరియంట్ నాలుగు కేసులు గుర్తించారు. ఈ వేరియంట్లు చైనా, ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో కొవిడ్ కేసుల పెరుగుదలకు కారణమని వైద్యులు చెబుతున్నారు.

కేరళలో మే నెలలో 278 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడు, మహారాష్ట్రలో కూడ ఈ సంఖ్య పెరుగుతోంది. బెంగళూరులో కరోనా తో కూడిన అనారోగ్య కారణాల వల్ల ఒక 84 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. అలాగే, తొమ్మిది నెలల శిశువు కూడా కొవిడ్ పాజిటివ్ గా తేలింది.

మహారాష్ట్రలో శనివారం 47, ఆదివారం 45 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 209కి చేరింది. అదే రాష్ట్రంలో డయాబెటిక్ కీటోయాసిడోసిస్ కారణంగా 21 ఏళ్ల వ్యక్తి థానేలో మరణించిన సంగతి వెల్లడైంది. ఈ మరణం రాష్ట్రంలో నాల్గవ కరోనా మరణంగా నమోదైంది.

ప్రస్తుతం కరోనా విజృంభణపై ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటూ, పౌరులకు సరైన సూచనలు ఇస్తున్నాయి.

Read More : జ్యోతి మల్హోత్రా – పూరీ ఆలయంలో డ్రోన్ కలకలం