మనీలాండరింగ్ కేసులో రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద అధికారులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు.
ఈ కేసుకు సంబంధించి అనిల్ అంబానీ విదేశాలకు పారిపోకుండా గతంలో లుకౌట్ సర్క్యులర్ జారీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈడీ విచారణకు హాజరైన అనిల్ అంబానీని అధికారులు పలు అంశాలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ విచారణలో భాగంగా కొన్ని కీలక ఆర్థిక లావాదేవీలు, అనుమానాస్పద ఖాతాలపై ఈడీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
Read More : బిగ్బాస్ అవకాశం పేరుతో వైద్యుడికి రూ.10 లక్షల మోసం

One thought on “ఈడీ విచారణకు అనిల్ అంబానీ హాజరు”
Comments are closed.