భారత సైన్యం, ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్థాన్పై చేపట్టిన దాడి వీడియోను ప్రెస్మీట్ సందర్భంగా మీడియాకు ప్రదర్శించింది. ఈ వీడియోలో భారత సైన్యం, ఇండియన్ నేవీ, ఆర్మీ, వాయుసేన తమ లక్ష్యాలను ఛేదించడాన్ని ప్రస్తావించింది.
ఇక, ఆపరేషన్ సమయంలో పాకిస్థాన్ మిరాజ్ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు భారత సైన్యం ఈరోజు ధృవీకరించింది. ఇటీవల విడుదల చేసిన వీడియోలో పాకిస్థాన్ మిరాజ్ శిథిలాలను స్పష్టంగా చూడవచ్చు.
పశ్చిమ ఏప్రిల్ 22న జమ్మూ-కాశ్మీర్లోని పహల్గామ్లో 26 మంది ప్రాణాలు కోల్పోయిన పాశవిక ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా మే 7న ఆపరేషన్ సిందూర్ ప్రారంభించబడింది. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో భారత సైన్యం, వైమానిక దళం, నావికాదళం సీనియర్ కమాండర్లు సమగ్ర వివరాలను పంచుకున్నారు.
ఈ బ్రీఫింగ్కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ ఎయిర్ వైస్ మార్షల్ ఏకే భారతి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ నావల్ ఆపరేషన్స్ వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ నేతృత్వం వహించారు.
ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంలో స్వదేశీ గగనతల రక్షణ వ్యవస్థ “ఆకాశ్” వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని ఎయిర్ వైస్ మార్షల్ ఏకే భారతి పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ భారత ప్రభుత్వం అందించిన బడ్జెట్, విధానపరమైన మద్దతు కారణంగా సులభతరమైంది అని ఆయన చెప్పారు.
ఆపరేషన్ సిందూర్ దాదాపు 25 నిమిషాల పాటు కొనసాగింది, ఇది మే 7 తెల్లవారుజామున ప్రారంభమైంది. ఇందులో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయన్నారు. అందులో నాలుగు పాకిస్థాన్ ప్రధాన భూభాగంలో, ఐదు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో ఉన్నాయన్నారు.
లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థల స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఎయిర్ వైస్ మార్షల్ ఏకే భారతి చెప్పారు. ఈ ఆపరేషన్ ద్వారా 100 మందికి పైగా ఉగ్రవాదులను తీయబడినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
Read More : DGMOs హాట్ లైన్ చర్చలు సాయంత్రానికి వాయిదా.
