తెలంగాణలో TDP ఎమ్మెల్యేకు భారీ షాక్!

హైదరాబాద్‌ కొండాపూర్‌ ఆర్టీఏ కార్యాలయ సమీపంలోని సర్వే నంబర్‌ 79లో టీడీపీ మైలవరం ఎమ్మెల్యేకు చెందిన 39 ఎకరాల భూమిపై అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారు.

ఈ నిర్మాణాలపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు హైడ్రాకు చేరడంతో అధికారులు తక్షణమే స్పందించారు. శనివారం ఉదయం భద్రతా బలగాల బందోబస్తు మధ్య వసంత గ్రూప్‌ కు చెందిన భూమిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు.

ఈ చర్యలతో కొండాపూర్ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.

Read More : తెలంగాణ అభివృద్ధికి ప్రపంచంతో పోటీ..