సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలో శుక్రవారం ఓ దారుణ సంఘటన చోటుచేసుకుంది. పక్కింటి వ్యక్తి శ్రీకాంత్, తనను చెల్లి అని పిలిచి ఓ వివాహితపై అత్యాచార యత్నం చేశాడు. గొడ్డలితో నరికి హత్య చేశాడు. అనంతరం, శ్రీకాంత్ భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.
వివరాలు ఇలా… రేఖను అతను ఒంటరిగా ఇంట్లోకి చొరబడినపుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. రేఖ భర్త విదేశంలో ఉద్యోగం నిమిత్తం ఉన్న సమయంలో శ్రీకాంత్ భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. రేఖ ప్రాణాల కోసం అతనితో పోరాటం చేసుకుంటూ, అతని దాడికి అడ్డుకట్ట వేసింది. ఆ తర్వాత, శ్రీకాంత్ రేఖను హత్య చేసి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.
రేఖ ఒంటిపై పంటి గాట్లు ఉన్నాయని స్థానికులు వెల్లడించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు రెండు మృతదేహాలను పోస్ట్మార్టం కోసం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు ఈ హత్య, ఆత్మహత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Read More : శాంతి చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల విజ్ఞప్తి

2 thoughts on “గంభీరావుపేటలో దారుణ ఘటన”
Comments are closed.