పులివెందుల ZPTC ఎన్నికపై హైకోర్టులో YSRCP పిటిషన్

పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి YSRCP హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పోలింగ్ బూత్‌లలో చేసిన మార్పులను సవాలు చేస్తూ ఈ పిటిషన్‌ను సమర్పించింది.

ఈ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాసేపట్లో విచారణ జరపనుంది. ఎన్నికల సందర్భంగా బూత్‌ల మార్పులు నిబంధనలకు విరుద్ధమని YSRCP ఆరోపిస్తోంది. దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠ నెలకొంది.

Read More : ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం