ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నైపుణ్యాలు పెంచేందుకు మైక్రోసాఫ్ట్ కంపెనీతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ, ఏపీఎస్ఎస్ఈ మధ్య ఎంవోయూ (MOU)పై సంతకాలు జరిగాయి.
ఈ ఒప్పందం ప్రకారం, మైక్రోసాఫ్ట్ సంస్థ ఒకే ఏడాది వ్యవధిలో దాదాపు 2 లక్షల మంది యువతకు శిక్షణను అందించనుంది. అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలను అందుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే ఈ ప్రణాళిక లక్ష్యంగా ఉంది.
ఈ శిక్షణలో భాగంగా రాష్ట్రంలోని 50 గ్రామీణ ఇంజినీరింగ్ కాలేజీల్లో 500 మంది అధ్యాపకులకు శిక్షణ ఇవ్వనున్నారు. అదేవిధంగా, 10,000 మంది విద్యార్థులకు ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్లో శిక్షణ, 30 ఐటీఐలలోని 30,000 మంది విద్యార్థులకు డిజిటల్ ప్రొడక్టివిటీపై శిక్షణను అందించనున్నారు.
ఈ ఒప్పందం ద్వారా యువతకు టెక్నాలజీ నైపుణ్యాలను పెంపొందించి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.

One thought on “మైక్రోసాఫ్ట్-ఏపీ ప్రభుత్వం ఒప్పందం: 2 లక్షల మందికి ఏఐ శిక్షణ”
Comments are closed.