కరీంనగర్ జిల్లాలోని ఒక ప్రభుత్వ గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతోన్న బాలికపై జూనియర్ లెక్చరర్ లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
వార్షిక పరీక్షల అనంతరం వేసవి సెలవుల కోసం ఇంటికి వెళ్లిన బాలికకు శారీరక సమస్యలు తలెత్తడంతో తల్లిదండ్రులు ఆమెను వివిధ ఆసుపత్రులకు తీసుకెళ్లారు. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యులు అనుమానాస్పదంగా కేసును పరిశీలించడంతో, బాలికను ప్రశ్నించిన తల్లిదండ్రులకు అసలైన విషయం బయటపడింది.
ఓ నెల క్రితమే జూనియర్ లెక్చరర్ తనను గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక చెప్పడంతో, తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్కు తరలించారు.
ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ, బాధ్యులైన గురుకుల సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యా వ్యవస్థ పట్ల ప్రభుత్వ బేఖాయతీ, విద్యాశాఖ మంత్రిత్వ శాఖ చర్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వం ఈ ఘటనపై వెంటనే స్పందించి, బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Read More : తెలంగాణకు వర్ష హెచ్చరిక

2 thoughts on “గురుకులంలో విద్యార్థినిపై లైంగిక దాడి కలకలం.”
Comments are closed.