9 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు

వరంగల్ పరిధిలోని ఏజే మిల్స్ పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ జె. వెంకట రత్నంను సస్పెండ్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

భూ వివాదంలో బాధితులకు న్యాయం కాకుండా, తప్పుడు కేసు నమోదు చేసిన ఇన్స్‌పెక్టర్ 9 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తి పేరును కూడా నమోదు చేయడంతో నిందితులకు సహకరించినట్లు నిర్ధారించారు.

అంతేకాక, మరో కేసులో పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒక మహిళా నిందితురాలిని లైంగిక వేధింపులకు గురి చేసినట్లు విచారణలో తేలడంతో ఈ చర్య తీసుకున్నారు.

వరంగల్ పోలీస్ కమిషనర్ ఈ చర్య ద్వారా న్యాయానికి అడ్డుపడే దుర్వినియోగాలను అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Read More : గురుకులంలో విద్యార్థినిపై లైంగిక దాడి కలకలం.

One thought on “9 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు

Comments are closed.