హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి రూపంలో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహం ప్రస్తుతం పెద్ద రాజకీయ వివాదానికి దారితీసింది. గోషామహల్ నియోజకవర్గంలోని అఘాపురాలో వినాయక చవితి వేడుకల సందర్భంగా తెలంగాణ ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో ఈ విగ్రహం నెలకొల్పబడింది. అయితే, ఈ విగ్రహం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పోలి ఉండటంపై స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.
“రేవంత్ రెడ్డి దేవుడు కాదు, ఆయన రూపంలో విగ్రహం ఏర్పాటు చేయడం హిందూ మనోభావాలను కించపరచడమే” అని రాజాసింగ్ తీవ్రంగా విమర్శించారు. ఈ విగ్రహాన్ని, మండపాన్ని తక్షణమే తొలగించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు లేఖ రాశారు.
ముఖ్యమంత్రిపై గౌరవంతోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉండవచ్చని ఆయన అంగీకరించినప్పటికీ, మతపరమైన అంశాలను దెబ్బతీసేలా ఇటువంటి చర్యలు అసహ్యకరమని రాజాసింగ్ స్పష్టం చేశారు. మత విశ్వాసాలను గౌరవించడం అందరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు.
Read More : వరదలపై ఆందోళన వ్యక్తం చేసిన కేసీఆర్

One thought on “హైదరాబాద్లో సీఎం రూపంలోని గణనాథుడి విగ్రహంపై వివాదం”
Comments are closed.