ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అనా కొణిదెల ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇటీవల సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు మార్క్ శంకర్ స్వల్ప గాయాలతో బయటపడిన నేపథ్యంలో, అనా మొక్కులు చెల్లించేందుకు ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.
ఆమె సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో భాగంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి అనగా స్వామి వారిపై నమ్మకముందని డిక్లరేషన్ కూడా ఇచ్చారు. టీటీడీ నియమాల ప్రకారం, ఇతర మతానికి చెందినవారు వెంకన్న దర్శనానికి వచ్చినపుడు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అనా ఈ ప్రక్రియను గాయత్రి సదనంలో పూర్తిచేశారు.
ఆదివారం రాత్రి ఆమె వరాహ స్వామిని కూడా దర్శించుకున్నారు. పవన్ కల్యాణ్ ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో అనా కొణిదెల తిరుమలకు ఒంటరిగా వెళ్లినట్టు సమాచారం. భక్తిగా ఆలయ దర్శనం పూర్తి చేసిన ఆమె తలనీలాల సమర్పణతో తన మొక్కులు చెల్లించుకున్నారు.
సింగపూర్ ఘటన అనంతరం ఆమె శాంతియుతంగా పూజలు చేయడం, తిరుమలలో స్వామివారి సేవలో పాల్గొనడం విశేషంగా మారింది. పవన్ కుటుంబానికి తలెత్తిన ప్రమాదం నుంచి వారు సురక్షితంగా బయటపడటమే కాక, అనా భక్తిశ్రద్ధలతో తీర్ధయాత్ర చేపట్టిన తీరు చర్చనీయాంశంగా మారింది.

One thought on “అనా కొణిదెల.. శ్రీవారికి తలనీలాలు సమర్పణ”
Comments are closed.