మిర్చి రైతుల సమస్యలపై చంద్రబాబు లేఖ.. కేంద్రానికి వెంటనే చర్యలు కోరుతూ విజ్ఞప్తి

Nara Chandra Babu

ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ.. మిర్చి రైతుల కోసం వినతి

అమరావతి, ఫిబ్రవరి 19: ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ (Union Minister Shivaraj Singh Chouhan)కు పంపిన ఈ లేఖలో, రాష్ట్రంలోని మిర్చి రైతుల కష్టాలను వివరించారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (Market Intervention Scheme) కింద కేంద్రం వెంటనే మిర్చిని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ నెల 14న ఢిల్లీలో జరిగిన సమావేశంలో మార్కెట్‌లో మిర్చి ధరలు పడిపోవడం, రైతులు ఆర్థికంగా నష్టపోతున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వివరించిందని సీఎం లేఖలో పేర్కొన్నారు. అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తన ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించినట్లు తెలిపారు.

రైతులకు నష్టపరిహారం కింద కేంద్రం చర్యలు తీసుకోవాలి

రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని, మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద మొత్తం వ్యయాన్ని కేంద్రమే భరించాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ సీజన్‌లో మిర్చి సాగు విస్తీర్ణం పెరగడంతో ఉత్పత్తి కూడా భారీగా పెరిగిందని వివరించారు. గతంలో ప్రత్యేక రకం మిర్చి క్వింటాల్‌ ధర రూ. 20,000 ఉండగా, ఇప్పుడు అది రూ. 13,000కి పడిపోయిందని, సాధారణ మిర్చి ధర క్వింటాల్‌కు రూ. 11,000కి తగ్గిపోయిందని తెలిపారు.

పలు దేశాలకు ఎగుమతులు తగ్గిపోవడంతో మార్కెట్‌లో ధరలు పడిపోయాయని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చంద్రబాబు వివరించారు. కాబట్టి, కేంద్ర ప్రభుత్వం తక్షణమే మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద మిర్చిని కొనుగోలు చేసి, రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.

Read More

One thought on “మిర్చి రైతుల సమస్యలపై చంద్రబాబు లేఖ.. కేంద్రానికి వెంటనే చర్యలు కోరుతూ విజ్ఞప్తి

Comments are closed.