“బెంగళూరులో ‘ముడా’ కేసులో ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి దీపాచోళన్”

బెంగళూరు: ‘ముడా’ కేసులో ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి

ముడా ఇంటి స్థలాల వివాదంలో నగరాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి దీపాచోళన్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈడీ వారు జారీ చేసిన నోటీసుల మేరకు, మంగళవారం బెంగళూరులోని శాంతినగర్ ప్రాంతంలోని ఈడీ కార్యాలయానికి రికార్డులతో పాటు సెక్రటరీ హాజరయ్యారు. సాయంత్రం వరకు విచారణలు కొనసాగినట్లు సమాచారం. నగరాభివృద్ధి శాఖ ఉద్యోగులకు కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఇతర అధికారుల విచారణలు తర్వాత, సంబంధిత మంత్రికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు సాగిన విచారణలతో పోలిస్తే, ఐఏఎస్ అధికారి దీపాచోళన్ స్వయంగా విచారణకు హాజరైనందున ఇతర అధికారుల్లో వణుకు ఏర్పడింది.