అమరావతి బ్రాండ్ అంబాసిడర్ వైష్ణవి.

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన అంబుల వైష్ణవి, సచివాలయంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

అమరావతిని ప్రపంచానికి ప్రమోట్ చేయడానికి తాను తీసుకుంటున్న చర్యలను వైష్ణవి మంత్రికి వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైష్ణవిని అమరావతి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో వైష్ణవి తన తండ్రి మనోజ్‌తో కలిసి మంత్రి నారాయణతో పలు కీలక అంశాలపై చర్చించారు.

Read More : ప్రపంచ రికార్డు సాధించిన స్టార్టప్ విప్లవం