మయన్మార్‌లో వైమానిక దాడి.. 23 మంది మృతి .

మయన్మార్‌లోని సగయింగ్ ప్రాంతంలో విషాదకర ఘటన జరిగింది. అక్కడి ఒక బౌద్ధారామంపై జరిగిన వైమానిక దాడిలో కనీసం 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారని స్థానిక మీడియా వెల్లడించింది. క్షతగాత్రుల్లో పది మందికి పైగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ బౌద్ధారామంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన దాదాపు 150 మంది ఆశ్రయం పొందుతున్నారని తిరుగుబాటుదారుల నేత ఒకరు తెలిపారు. అయితే ఈ దాడిపై మయన్మార్ సైన్యం నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 2021 ఫిబ్రవరిలో అంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వం కూలిన తర్వాత మయన్మార్‌లో అంతర్యుద్ధ వాతావరణం ఏర్పడింది. సైన్యం అధికారాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత శాంతియుతంగా సాగిన ప్రజా నిరసనలను బలవంతంగా అణిచివేయడంతో, తిరుగుబాటుదారులు ఆయుధాలు ఎత్తుకున్నారు.

దీని వల్ల దేశంలో గద్దెలపట్టి పోరాటాలు ముదిరాయి. తాజా దాడిలో తిరుగుబాటుదారులు బౌద్ధారామంలో తలదాచుకుంటున్నారని తెలిసిన నేపథ్యంలోనే సైన్యం ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Read More : బంగ్లాదేశ్‌లో ‘సర్’ సంబోధనపై కీలక నిర్ణయం