శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ తవ్వకంపై కీలక నిర్ణయాలను సాంకేతిక కమిటీ తీసుకుంది. ఇన్లెట్ వైపు టన్నెల్ తవ్వకాన్ని డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ (DBM) పద్ధతిలో మాత్రమే కొనసాగించాలని, ప్రస్తుతం ఉపయోగిస్తున్న టన్నెల్ బోరింగ్ మెషిన్ (TBM) విధానం అసాధ్యమని ప్రభుత్వానికి స్పష్టంగా సూచించింది.
ఈ టన్నెల్ విషయంలో సాంకేతిక కమిటీ కొన్ని ప్రధాన సూచనలు చేసింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా టన్నెల్ పనులు జరగాలని తెలిపింది. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (INRM) సహాయం తీసుకోవాలని, ప్రమాదానికి గురైన 50 మీటర్ల ప్రాంతంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI), నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI) ద్వారా సమగ్ర సర్వే చేయాలని కమిటీ సూచించింది.
అలాగే, ఈ నెల 30లోగా జియో టెక్నికల్ పరీక్షలు పూర్తి చేయాలని, జూన్ 30లోగా సమగ్ర సర్వే నివేదిక సిద్ధం చేయాలని, ఆగస్టు నెలలో పూర్తి ప్రణాళికను ప్రభుత్వం ముందు ఉంచాలని సూచనలు ఇచ్చింది.
డీబీఎం విధానంలో తవ్వకానికి అయ్యే వ్యయాన్ని అంచనా వేయాలని, మిగిలిన పనులను ఎప్పుడు పూర్తి చేస్తారనే అంశంపై నిర్మాణ సంస్థ జయప్రకాష్ అసోసియేట్స్ నుంచి సమగ్ర ప్రణాళిక తీసుకోవాలని సాంకేతిక కమిటీ సిఫార్సు చేసింది.
ఈ సూచనలు ప్రభుత్వం ముందు నిర్ణాయకంగా మారనున్నాయి. SLBC టన్నెల్ పనుల్లో వేగం పెరిగేలా ఈ సిఫార్సులు మార్గదర్శకంగా నిలవనున్నాయి.
Read More : కవిత కొత్త పార్టీపై రాజకీయాలు వేడెక్కుతున్నాయి.?

One thought on “SLBC టన్నెల్ తవ్వకంపై సాంకేతిక కమిటీ కీలక సూచనలు.”
Comments are closed.