తమిళనాడు సేలం జిల్లాలో గబ్బిలాల వేట, విక్రయం కేసు వెలుగులోకి వచ్చింది. ఒమలూర్ సమీపంలోని డానిష్పేట్టై వద్ద ఫ్రూట్ బ్యాట్లను వేటాడి, వాటి మాంసాన్ని చికెన్గా విక్రయిస్తున్నారనే సమాచారం ఆధారంగా అటవీ శాఖ అధికారులు కమల్, సెల్వం అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. తోప్పూర్ రామస్వామి అటవీ పరిధిలో తరచూ గన్షాట్ల శబ్దాలు వినిపించడంతో ఫారెస్ట్ రేంజర్ విమల్కుమార్ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకుంది. ప్రాథమిక దర్యాప్తులో ఈ ఇద్దరూ అటవీ ప్రాంతంలో ఫ్రూట్ బ్యాట్లను వేటాడి, వండి, చికెన్ మాంసంగా విక్రయిస్తున్నట్లు తేలింది. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఫ్రూట్ బ్యాట్లు భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం షెడ్యూల్-II కింద రక్షణ పొందుతున్నాయి. వీటిని వేటాడడం లేదా అమ్మడం చట్టవిరుద్ధం. ఈ నేరానికి గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 3 లక్షల వరకు జరిమానా విధించవచ్చు.
ఇంతకు ముందు కూడా 2021లో తుమకూరు జిల్లాలో 25 ఫ్రూట్ బ్యాట్లను మాంసం కోసం రవాణా చేస్తూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్రూట్ బ్యాట్ల వేట పర్యావరణ సమతుల్యతకు తీవ్ర ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కమల్, సెల్వంపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 సెక్షన్ 9, 39 కింద కేసు నమోదు చేశారు.
Read More : ఆమిర్ ఖాన్ ఇంటికి 25 మంది ఐపీఎల్ అధికారులు

One thought on “సేలంలో గబ్బిలాల వేట, చికెన్గా విక్రయం”
Comments are closed.