పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేశ్లపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో నమోదైన కేసులో సజ్జల భార్గవ్రెడ్డిపై మంగళగిరి పోలీస్ స్టేషన్లో విచారణ ముగిసింది. అయితే ఆయన ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేవని పోలీసులు పేర్కొన్నారు.
ఈ కేసు విషయమై మంగళగిరి పట్టణ సీఐ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, “సజ్జల భార్గవ్రెడ్డిని విచారించాం. ఆయన ఇచ్చిన సమాధానాలు మా అనుమానాలను తొలగించలేకపోయాయి. తదుపరి విచారణ కోసం మళ్లీ నోటీసులు ఇవ్వాల్సి వస్తే ఇస్తాం” అని తెలిపారు.
సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన, వివాదాస్పదమైన కంటెంట్ను పోస్టు చేసినట్టు వచ్చిన ఫిర్యాదుతో సజ్జల భార్గవ్రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా పోలీసులు ఆయన్ను స్టేషన్కు పిలిపించి వివరణ కోరారు. విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. తదుపరి చర్యలపై పోలీసు శాఖ త్వరలో స్పష్టత ఇవ్వనుంది.
Read More : ఎన్టీఆర్ 102వ జయంతి: పవన్ కళ్యాణ్ ఘన నివాళులు.
