మహా కుంభమేళాలో పవన్ కల్యాణ్ పుణ్యస్నానం – సంచలన వ్యాఖ్యలు!

pawan kalyan

“వేల సంవత్సరాలుగా కుంభమేళా జరుగుతున్నట్టు చరిత్ర చెబుతోంది. ప్రతిసారి హాజరుకావాలని అనుకున్నా, ఇప్పటివరకు సాధ్యపడలేదు. అయితే ఈసారి మహా కుంభమేళాకు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది,” అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

భార్య అనా కొణిదెల, కుమారుడు అకిరా నందన్, దర్శకుడు త్రివిక్రమ్, టీటీడీ సభ్యుడు ఆనంద సాయితో కలిసి మంగళవారం ఆయన మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు నిర్వహించారు. త్రివేణి సంగమం వద్ద హారతులు సమర్పించారు.

మాధ్యమాలతో మాట్లాడిన పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, “**భారతదేశంలోని ప్రజలు వివిధ జాతులు, తెగలు, సంప్రదాయాలను అనుసరిస్తున్నా, *సనాతన ధర్మం* విషయంలో మాత్రం ఏకతాటిపై నిలుస్తారు. ఇది భవిష్యత్తులోనూ మరింత అభివృద్ధి చెందాలి. ప్రపంచంలో ఇంత భారీ స్థాయిలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమం మరోటి లేదు**” అని తెలిపారు.

అలాగే, “మహా కుంభమేళాలో జరిగిన కొన్ని ఘటనలు దురదృష్టకరం. సనాతన ధర్మాన్ని నమ్మి పాటించే వారిపై ఇలాంటి సందర్భాల్లో కొందరు నేతలు ఇష్టానుసారం మాట్లాడటం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మహాకుంభమేళా నిర్వహణలో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. సనాతన ధర్మం నమ్మే వారి మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదు” అని వ్యాఖ్యానించారు.

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ‘మృత్యు కుంభమేళా’ వ్యాఖ్యలపై స్పందిస్తూ, “కోట్లాది మంది భక్తుల మనోభావాలను బాధపెట్టేలా మమతా బెనర్జీ వ్యాఖ్యానించడం దురదృష్టకరం” అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Read More

One thought on “మహా కుంభమేళాలో పవన్ కల్యాణ్ పుణ్యస్నానం – సంచలన వ్యాఖ్యలు!

Comments are closed.