కూకట్‌పల్లిలో వర్షం కారణంగా భారీ ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌లో ఉదయం నుంచి కురుస్తున్న వర్షం నగర వాసులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది. కూకట్‌పల్లిలో రోడ్డు కొట్టుకుపోవడంతో మ్యాన్‌హోల్‌ బయటపడటంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. వై జంక్షన్‌ నుంచి కూకట్‌పల్లి బీజేపీ కార్యాలయం వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఓ అంబులెన్స్ కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. అదనంగా భరత్‌నగర్‌ వంతెనపై కూడా ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Read More : కేంద్ర ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు