రాచకొండలో అంతరాష్ట్ర సెల్‌ఫోన్ దొంగల ముఠా బస్టు

రాచకొండ కమిషనరేట్ పరిధిలో అంతరాష్ట్ర సెల్‌ఫోన్ దొంగల ముఠా బస్టైంది. మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.50 లక్షల విలువైన 473 మొబైల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన ప్రధాన నిందితుడు సాయి కుమార్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ముఠా రాష్ట్రాల మధ్య తిరుగుతూ భారీ స్థాయిలో సెల్‌ఫోన్లు దొంగిలించిందని పోలీసులు వెల్లడించారు.

Read More : కూకట్‌పల్లిలో వర్షం కారణంగా భారీ ట్రాఫిక్ జామ్

One thought on “రాచకొండలో అంతరాష్ట్ర సెల్‌ఫోన్ దొంగల ముఠా బస్టు

Comments are closed.