కవలలకంటే ఎక్కువగా ఉన్న వారి కెరీర్ పోలికలు

టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టు ఫార్మాట్‌కు అర్థాంతరంగా గుడ్‌బై చెప్పిన విషయం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. పూర్తి ఫిట్‌నెస్, మంచి ఫామ్‌లో ఉన్నా, ఇంకా కొన్నేళ్లు ఆడగల సామర్థ్యం ఉన్నప్పటికీ ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం ప్రతి ఒక్కరికీ షాకే తీరింది.

ఈ మధ్య జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో చివరి మ్యాచ్ ఆడి టెస్టులకు వీడ్కోలు పలికాడు కోహ్లీ. ఇదే సిరీస్‌లో భారత స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా తన టెస్ట్ కెరీర్‌కు ముగింపు పలికిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, కోహ్లీ-అశ్విన్ కెరీర్ మధ్య అనేక అసాధారణమైన పోలికలు ఉన్నాయి.

2011లో ఇద్దరూ కరీబియన్ జట్టుతోనే టెస్టుల్లో అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి 14 ఏళ్ల పాటు భారత జట్టుకు సేవలందించారు. విభిన్న మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శనలతో జట్టును గెలిపించారు. 2016-17 సీజన్‌లో ఇద్దరూ తమ కెరీర్‌లో అగ్రస్థాయిని అందుకున్నారు. అశ్విన్ ఆ సీజన్‌లో 97 వికెట్లు పడగొట్టి, 659 పరుగులు చేసినా, కోహ్లీ 1215 పరుగులు బాది సూపర్ ఫామ్‌లో కనిపించాడు.

ఇప్పుడు అదే తరహాలో ఒకేసారి ఇద్దరూ టెస్టులకు గుడ్‌బై చెప్పడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘‘ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు, ఒకేసారి పీక్‌కి వెళ్లారు, ఒకేసారి రిటైర్ అయ్యారు’’ అంటూ నెటిజన్లు వీరిద్దరినీ కవలలతో పోలుస్తూ కామెంట్లు చేస్తున్నారు.

కోహ్లీ, అశ్విన్ లాంటి దిగ్గజాలు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో అభిమానులు తమ అభిమాన ఆటగాళ్ల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ హ్యాపీ రిటైర్‌మెంట్ మెసేజులు పోస్ట్ చేస్తున్నారు.

Read More : IPL 2025 మళ్లీ ప్రారంభం

One thought on “కవలలకంటే ఎక్కువగా ఉన్న వారి కెరీర్ పోలికలు

Comments are closed.