ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు రాత్రి సింగపూర్ పర్యటనకు బయలుదేరుతున్నారు. మొత్తం ఆరు రోజులపాటు కొనసాగనున్న ఈ పర్యటనలో ఆయన రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే దిశగా కీలక చర్యలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా పలు ప్రముఖ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి అవకాశాలను వివరించనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి అనుకూల వాతావరణం, పెట్టుబడిదారులకు అందిస్తున్న సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలపై వారికి వివరాలు అందజేయనున్నారు. ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్కు గణనీయమైన పెట్టుబడులు రాబట్టాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు.
Read More : ఆంధ్రప్రదేశ్ను రక్షణ హబ్గా తీర్చిదిద్దాలని టీడీపీ వినతి

One thought on “ఈరోజు రాత్రి సింగపూర్ పర్యటనకు సీఎం”
Comments are closed.