బాలీవుడ్ క్లాసిక్గా నిలిచిన “చల్తే చల్తే” సినిమాలో మొదట మహిళా ప్రధాన పాత్రకు ఐశ్వర్యా రాయ్ ఎంపికయ్యారు. కానీ కొన్ని అనుకోని కారణాలతో ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న తర్వాత రాణి ముఖర్జీ వచ్చారు. తాజాగా దర్శకుడు అజీజ్ మిర్జా ఈ విషయంపై స్పందిస్తూ, ఐశ్వర్యా రాయ్ కేవలం ఒక్క రోజు మాత్రమే షూటింగ్ చేశారని వెల్లడించారు.
రేడియో నషా ఇంటర్వ్యూలో అజీజ్ మిర్జా మాట్లాడుతూ, “ప్రేమ నగరియా” అనే పాటను మొదలు పెట్టినప్పుడు ఒక్క రోజు షూటింగ్ చేశామని చెప్పారు. అనుకోని పరిస్థితుల వల్ల ఐశ్వర్యా షూటింగ్ కొనసాగించలేకపోయారని, వెంటనే రాణి ముఖర్జీ వచ్చారని వివరించారు. దీంతో “చల్తే చల్తే” కథలో కొత్త టర్న్ వచ్చింది.
అజీజ్ మిర్జా ఈ సినిమాలో మొదటిసారి షారుఖ్ ఖాన్కు జూహీ చావ్లా బదులుగా వేరే హీరోయిన్ను తీసుకున్నారు. ఈ నిర్ణయం గురించి మాట్లాడిన మిర్జా, ప్రేక్షకులకు మార్పు చూపించాలనే ఉద్దేశంతో కొత్త జంటను తీసుకున్నట్టు చెప్పారు. కాగా, షారుఖ్-రాణి ముఖర్జీ యాక్టింగ్ కు ప్రేక్షకుల నుండి గొప్ప స్పందన లభించింది.
ప్రస్తుతం ఐశ్వర్యా రాయ్ చివరిసారిగా “పొన్నియన్ సెల్వన్ 2” సినిమాలో కనిపించారు. ఆమె తదుపరి ప్రాజెక్ట్పై ఇంకా అధికారిక ప్రకటన లేదు. మరోవైపు, షారుఖ్ ఖాన్ తన కూతురు సుహానా ఖాన్తో కలిసి “కింగ్” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నారు.

One thought on “ఒక్క రోజు షూటింగ్ తర్వాత తప్పుకున్న ఐశ్వర్యా.. రాణి ముఖర్జీ ఎంట్రీ!”
Comments are closed.