ఏపీలో పోలీసు కానిస్టేబుల్ నియామకాల తుది ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత, ఏపీ డీజీపీ హరీశ్కుమార్ గుప్తా శుక్రవారం ఉదయం మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఫలితాలను ప్రకటించారు. ఈ ఫలితాలను ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ https://slprb.ap.gov.in/లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ఫలితాల్లో గండి నానాజీ 168 మార్కులతో ప్రథమ స్థానం సాధించగా, జి. రమ్య మాధురి 159 మార్కులతో రెండో స్థానం, మెరుగు అచ్యుతారావు 144.5 మార్కులతో మూడో స్థానంలో నిలిచారని అధికారులు వెల్లడించారు. ఈ నియామకాల ద్వారా మొత్తం 6,100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం.
Read More : జగన్ నెల్లూరు పర్యటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం

One thought on “ఏపీలో కానిస్టేబుల్ ఫలితాలు విడుదల”
Comments are closed.