విజయవాడ నగరంలోని బీసెంట్ రోడ్డులో శనివారం ఉదయం బాంబు ఉనికిని సూచించే ఫోన్కాల్తో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. గుర్తుతెలియని వ్యక్తి విజయవాడ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి “బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టామంటూ” సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
వెంటనే రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ ప్రదేశాన్ని పరిశీలించి, బీసెంట్ రోడ్డులోని షాపులను తాత్కాలికంగా మూసివేసి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. ఆధునిక పరికరాలతో బాంబు డిటెక్షన్ పనులు చేపట్టారు.
గంటల పాటు సాగిన తనిఖీలలో ఎలాంటి పేలుడు పదార్థాలు కనుగొనబడలేదు. పోలీసులు ఈ ఫోన్ కాల్ను ప్రాంక్ కాల్గా భావిస్తున్నప్పటికీ, పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఇలాంటి తప్పుడు సమాచారం ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు గందరగోళానికి గురవకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఈ ఘటన వల్ల బీసెంట్ రోడ్డులో కొంత ఉద్రిక్తత ఏర్పడినప్పటికీ, పోలీసులు త్వరగా చర్యలు తీసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
Read More : ఏపీలో మూడేళ్ల బాలికపై దారుణ అత్యాచారం.
