మాంచెస్టర్ వేదికగా క్రికెట్ అభిమానులు, ఫుట్బాల్ అభిమానులకి అరుదైన దృశ్యం కనిపించింది. టీమిండియా క్రికెటర్లు, మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ ఆటగాళ్లు ఒకే వేదికపై కలుసుకున్నారు. మాంచెస్టర్లో ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ సందర్భంగా భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్బాలర్లతో కలిసి ఫోటోషూట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు జట్ల స్టార్ ఆటగాళ్లు పరస్పరం అనుభవాలను పంచుకున్నారు. క్రికెట్ మరియు ఫుట్బాల్ అభిమానులకి ఇది ఓ గుర్తుండిపోయే క్షణంగా నిలిచింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా మారాయి. అభిమానులు “క్రికెట్ మీట్స్ ఫుట్బాల్” అంటూ హర్షాతిరేకంగా స్పందిస్తున్నారు.
ఈ రెండు జట్లకు కిట్ స్పాన్సర్గా అడిడాస్ వ్యవహరిస్తుండడం మరో విశేషం. రెండు విభిన్న క్రీడల ఆటగాళ్లు ఒకే వేదికపై కలవడం, క్రీడల ద్వారా ప్రపంచం ఏకతాటిపైకి వస్తుందనేది మరోసారి రుజువైంది.




Read More : నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు షాక్

One thought on “క్రికెట్-ఫుట్బాల్ స్టార్స్ ఒకే ఫ్రేమ్లో”
Comments are closed.