డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు మెడికల్ రిపోర్ట్ ఇవ్వడంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ పద్మావతి సీఐడీ విచారణకు హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. డాక్టర్ పద్మావతికి 7, 8 తేదీల్లో ఉదయం 10 గంటలకు విచారణాధికారి ముందుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. విచారణలో సహకరించకపోతే ఆమెకు గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణను రద్దు చేయడం జరుగుతుందని కోర్టు హెచ్చరించింది.
ఇంతలో, ప్రభుత్వ తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా పద్మావతి విచారణకు సహకరించడం లేదని సాక్ష్యాలతో సహా కోర్టు ముందుకు వేశారు. సుప్రీంకోర్టులో, పద్మావతికి ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చేసిన పిటిషన్ హైకోర్టు తోసిపుచ్చింది, తదుపరి సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆమెకు మధ్యంతర రక్షణ ఇవ్వబడింది. అయితే, ఆమె విచారణకు హాజరుకావడం లేదని ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు, ఆమె విచారణకు తప్పక హాజరుకావాలని ఆదేశించింది, లేదంటే మధ్యంతర రక్షణను తొలగిస్తామని హెచ్చరించింది.
Read More : తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రామ్మోహన్ నాయుడు పిలుపు …

One thought on “డిప్యూటీ స్పీకర్ కస్టోడియల్ టార్చర్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..”
Comments are closed.