ఇండియన్ స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ను ఉత్సాహభరిత వాతావరణంలో ముగించాయి. ఉదయం నుంచే లాభాల బాట పట్టిన సూచీలు, రోజంతా అదే జోష్ను కొనసాగించాయి. చివరకు గణనీయమైన లాభాలతో మార్కెట్లు ట్రేడింగ్ ముగించాయి.
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్(BSE) సూచీ సెన్సెక్స్ 1,577.63 పాయింట్ల భారీ లాభంతో 76,734.89 వద్ద స్థిరపడింది. అదే విధంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్(NSE) సూచీ నిఫ్టీ 500 పాయింట్లు పెరిగి 23,328.55 వద్ద ముగిసింది. దాదాపు 2.25 శాతం మేర మార్కెట్లు ఎగబాకాయి.
ఈ రోజు మార్కెట్లో టాప్ గెయినర్స్ జాబితాలో ఐమ్కో ఎలెకాన్ (ఇండియా), ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఫినో పేమెంట్స్ బ్యాంక్, పాండీ ఆక్సైడ్స్ అండ్ కెమికల్స్, ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ షేర్లు ముందంజలో నిలిచాయి.
అదే సమయంలో కొంతమంది ఇన్వెస్టర్లకు నష్టాలు ఎదురయ్యాయి. క్వెస్ కార్ప్, రాజ్ టెలివిజన్ నెట్వర్క్, ఉమా ఎక్స్పోర్ట్స్, స్టార్టెక్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీలు ఈ రోజు నష్టాల్లో కుదేలైన షేర్లలో ఉంటాయి.
మొత్తానికి ట్రేడింగ్ రోజంతా కొనుగోళ్ల జోరు మార్కెట్లను చక్కగా లాభాల బాటలో నడిపించిందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

One thought on “సెన్సెక్స్ 1,577 పాయింట్లు జంప్ — నిఫ్టీ కూడా భారీ లాభాల్లో ముగింపు!”
Comments are closed.