బుధవారం ట్రేడింగ్ సెషన్లో భారత స్టాక్ మార్కెట్ మిశ్రమ సంకేతాల మధ్య స్వల్ప లాభాలతో ముగిసింది. ఆగస్టు 1 నాటికి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కుదురుతుందా? అన్న అనిశ్చితి కొనసాగుతున్నా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశానికి ముందు మార్కెట్ సానుకూల ధోరణిని ప్రదర్శించింది. అదనంగా, తొలి త్రైమాసిక ఫలితాలు కూడా మార్కెట్ సెంటిమెంట్పై ప్రభావం చూపించాయి.
సెన్సెక్స్ 143.91 పాయింట్లు పెరిగి 81,481.86 వద్ద ముగిసింది. గత సెషన్లో 81,337.95 వద్ద ముగిసిన సెన్సెక్స్ ఈ రోజు 81,594.52 వద్ద గ్యాప్-అప్తో ప్రారంభమైంది. ట్రేడింగ్లో సూచీ పరిమిత శ్రేణిలో కదలాడుతూ 81,618.96 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 33.95 పాయింట్లు లాభపడి 24,855.05 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్లో ఎల్అండ్టీ, సన్ఫార్మా, ఎన్టీపీసీ, మారుతి సుజుకి, భారతీ ఎయిర్టెల్, ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్ లాభపడ్డాయి. టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్సర్వ్, కోటక్ బ్యాంక్ నష్టాల్లో ముగిశాయి.
బ్యాంక్ నిఫ్టీ 71 పాయింట్లు పడిపోయింది. ముఖ్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ తొలి త్రైమాసిక ఫలితాల తర్వాత బ్యాంకింగ్ స్టాక్స్లో అమ్మకాలు జరిగాయి. అయితే, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభాలతో ముగిశాయి.
అస్థిరత నడుమ విస్తృత మార్కెట్లు మిశ్రమ పనితీరు కనబర్చాయి. నిఫ్టీ నెక్స్ట్-50, నిఫ్టీ-100 స్వల్ప లాభాలు సాధించగా, నిఫ్టీ మిడ్క్యాప్-100, నిఫ్టీ స్మాల్క్యాప్-100 తగ్గుదలతో ముగిశాయి.
ఇక రూపాయి మే 8 తర్వాత అత్యధిక రోజువారీ క్షీణతను ప్రదర్శించి, ఐదు నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది.
Read More : కాల్పుల విరమణకు ఏ దేశం మధ్యవర్తిత్వం చేయలేదు – జై శంకర్

One thought on “స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్”
Comments are closed.