జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారు మరియు ఆధ్యాత్మిక గొప్పవేత్త స్వామి వివేకానంద వర్ధంతులను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్లు ఘనంగా నివాళులు అర్పించారు. వీరి సేవలను, స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంతో కూడిన సందేశాలు పంచుకున్నారు. పింగళి వెంకయ్య జాతీయ గౌరవానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచిన త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన గొప్ప దేశభక్తుడని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. వారి నిస్వార్థ సేవలను గుర్తు చేసుకుంటూ ప్రతీ భారతీయుడు గర్వించాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ, పింగళి వెంకయ్య తెలుగువారు కావడం మనకు గర్వకారణమని పేర్కొన్నారు. దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని వివరించారు.
ఇక స్వామి వివేకానంద వర్ధంతిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు నివాళులు అర్పిస్తూ, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి అని ప్రశంసించారు. “యువతలో స్ఫూర్తిని నింపే ఆయన బోధనలు, ఆలోచనలు ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తాయి” అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
Read More : తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల కలకలం

One thought on “పింగళి, వివేకానందకు సీఎం చంద్రబాబు నివాళులు”
Comments are closed.