బుల్లితెర ఐకాన్ శ్వేతా తివారీ కుమార్తె పాలక్ తివారీ ఇప్పుడు బాలీవుడ్లో తనదైన స్థానం సంపాదించుకుంటోంది. వరుస చిత్రాల్లో నటిస్తూ తన సొంత గుర్తింపును సంపాదించుకుంటున్న ఈ యువనటి, త్వరలో ప్రేక్షకుల ముందుకు భూత్నీ అనే హారర్ చిత్రంతో రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాలక్ బిజీగా ఉంది. ఇటీవల తన గ్లామరస్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో చురుకుగా ఉంది.

ఇన్స్టాగ్రామ్లో పాలక్ తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు యువతను ఆకట్టుకుంటున్నాయి. బ్రాండ్ “క్లిప్సే”కు చెందిన ఎరుపు రంగు బాడీకాన్ మిడి డ్రస్లో ఆమె ఆకర్షణీయంగా మెరిసింది. ఈ డ్రస్ ఖరీదు రూ. 63,870. ఈ ప్రత్యేక డిజైన్తో డేట్ నైట్ థీమ్కు అద్భుతంగా సరిపోయేలా ఉంది. ఆమె లుక్స్కు యువతరం నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

భూత్నీ చిత్రంలో పాలక్తో పాటు సంజయ్ దత్, మౌనీ రాయ్, సన్నీ సింగ్ వంటి ప్రముఖులు నటిస్తున్నారు. సిధాంత్ సచ్దేవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే మంచి హైప్ ఏర్పడింది. ట్రైలర్ సాధారణంగా కనిపించినా, హారర్ సినిమాలపై ఆసక్తి తగ్గని ప్రేక్షకులు మంచి స్పందన చూపుతున్నారు.

పూణేలో జరిగిన ప్రమోషన్ ఈవెంట్లో పాలక్కు అభిమానుల నుంచి భారీ ఆదరణ లభించింది. తన అందం, ప్రతిభ, ఫ్యాషన్ సెన్స్తో షోబిజ్లో వేగంగా ఎదుగుతున్న పాలక్ తివారీపై ఈ చిత్రంతో మరింత ఫోకస్ పడనుంది.

One thought on “గ్లామర్తో దూసుకెళ్తున్న పాలక్.. భూత్నీతో హర్రర్ హంగామా”
Comments are closed.