మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ హీరోగా, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన “ఎల్ 2: ఎంపురాన్” సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని మోహన్లాల్ అధికారికంగా ప్రకటించారు. లూసిఫర్ కి సీక్వెల్గా రూపొందిన ఈ చిత్రం మోహన్లాల్ నటన, పృథ్వీరాజ్ టేకింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అయితే, అభిమన్యు సింగ్ పాత్ర నేపథ్యంలో వివాదం రేగింది. హిందుత్వ ఉగ్రవాదిగా అతడిని చూపించడం, గుజరాత్ నుంచి జాతీయ నాయకుడిగా ఎదిగిన తీరు రాజకీయ దుమారం రేపింది. ఒక జాతీయ పార్టీ నాయకులు ఈ పాత్రపై తీవ్ర విమర్శలు చేశారు. కొందరు ఈ పాత్రను తొలగించాలని, మరికొందరు సినిమాను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు.
రచయిత మురళీ గోపీ ఈ వివాదంపై స్పందిస్తూ, “ఎవరికి నచ్చినట్లు వారు ఊహించుకోవచ్చు” అని వ్యాఖ్యానించారు. ఆయన మాటలు మరింత వివాదాస్పదం అయ్యాయి. వామపక్ష భావజాలం పేరుతో హడావిడి చేయడంపై కూడా ఆయన సున్నిత వ్యాఖ్యలు చేశారు. లూసిఫర్ సమయంలోనూ వివాదాలు వచ్చాయి కానీ, ఈసారి పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి.

One thought on “ఎల్ 2: ఎంపురాన్ – విజయానికి ఎదురైన వివాదాల సవాళ్లు!”
Comments are closed.