ప్రభుత్వానికి విచారణ నివేదికను సమర్పించిన కాళేశ్వరం కమిషన్

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ తన తుది నివేదికను సమర్పించింది. బరాజ్‌ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ప్రభుత్వం 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

15 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణంపై విస్తృతంగా విచారణ జరిపిన కమిషన్, మొత్తం 115 మందిని విచారించి సాక్ష్యాలను సేకరించింది. విచారణ అనంతరం తుది నివేదికను సిద్ధం చేసి తాజాగా ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదికను సీల్డ్ కవర్‌లో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Read More : మద్యం మత్తులో పూజలు చేసిన అర్చకుడు తొలగింపు

One thought on “ప్రభుత్వానికి విచారణ నివేదికను సమర్పించిన కాళేశ్వరం కమిషన్

Comments are closed.