తెలంగాణ రాష్ట్ర మహిళలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుడు మొహమ్మద్ ఫెరోజ్ ఖాన్ వివరణ ఇచ్చారు. జూన్ 21న గాంధీ భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మహిళల అవమానానికి సంబంధించి ఆరోపణలు వెలువడ్డాయి. దీంతో సుమోటోగా కేసు నమోదు చేసిన రాష్ట్ర మహిళా కమిషన్, జూలై 4న ఫెరోజ్ ఖాన్ను తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. కమిషన్ ఛైర్పర్సన్ నేరెళ్ళ శారద సమక్షంలో ఫెరోజ్ ఖాన్ హాజరై వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించాయని, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన నేతగా అలాంటి వ్యాఖ్యలు అనుచితమని కమిషన్ స్పష్టం చేసింది. సంఘటిత ఘటనపై కమిషన్ విచారణ కొనసాగిస్తోంది.
Read More : కవిత – సీఎంగా మారటం లక్ష్యమేనని స్పష్టం
