సంక్రాంతి తర్వాత పెద్ద పండగగా భావించే దసరా తెలుగు సినిమా పరిశ్రమకు ప్రతి ఏడాదీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. స్కూల్ హాలిడేస్ సమయంతో పాటు, పండగ వాతావరణం కలగలిసిన ఈ సీజన్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లకు దారితీస్తుంది. ఈసారి కూడా దసరా బరిలో స్టార్ హీరోల మధ్య రసవత్తర పోటీ ఏర్పడనుంది. బాలకృష్ణ ‘అఖండ 2’, సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల యేటి గట్టు’, ప్రభాస్ ‘రాజా సాబ్’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న బాలకృష్ణ ‘అఖండ 2’ పై భారీ అంచనాలు ఉన్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ ఎలిమెంట్స్, పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ తో డిజైన్ చేసిన ఈ చిత్రం, దసరా సీజన్కి పర్ఫెక్ట్ ఫీస్ట్గా ఉండబోతోంది. మరోవైపు సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో రోహిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సంబరాల యేటి గట్టు’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది.
వీటితో పాటు ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘రాజా సాబ్’ కూడా బరిలో దిగేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇక దసరా పండగ సమయంలో తెలుగు బాక్సాఫీస్ పై డబ్బింగ్ సినిమాల హంగామా కూడా ఉండడం ఖాయం. దీనికి తోడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ కూడా దసరా రిలీజ్కి వస్తే ఈ పండగ మరింత రసవత్తరంగా మారే అవకాశముంది.
ప్రస్తుతం అఫీషియల్ అనౌన్స్మెంట్లు రాకపోయినా, ఈ సారి దసరా బరిలో స్టార్ సినిమాల పోటీని చూసి అభిమానులు ఖుషిగా ఉన్నారు. ఈ పండగ సీజన్లో సినిమాల ఫైట్ తో తెలుగు సినిమా ప్రేక్షకులకు గొప్ప వినోదం లభించనుంది.

One thought on “దసరా పండగలో స్టార్ హీరోల బరిలో పోరు!”
Comments are closed.