చైనా ఓపెన్లో భారత షట్లర్లు విజయాలతో దూసుకెళ్లారు. సింగిల్స్ విభాగంలో పీవీ సింధు తొలి రౌండ్లో జపాన్ ఆటగాడు మియాజకిని 21-15, 8-21, 21-17 స్కోర్లతో ఓడించారు. ఉన్నతి హుడా కూడా స్కాట్లాండ్ ప్లేయర్ గిల్మోర్పై 21-11, 21-16తో ఘన విజయం సాధించింది. రెండో రౌండ్లో సింధు–ఉన్నతి మధ్య పోరు ఆసక్తి రేపనుంది. డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ జపాన్ ద్వయం మిత్సుహషి/ఒకమురపై 21-13, 21-9తో సులభ విజయం సాధించి రెండో రౌండ్కి చేరుకుంది.
Read More : మాంచెస్టర్ టెస్టులో రిషబ్ పంత్ గాయం

One thought on “చైనా ఓపెన్లో సింధు, ఉన్నతి, సాత్విక్-చిరాగ్ విజయాలు”
Comments are closed.