యూపీలో సీఎస్‌ఈ ఇంటి వద్ద కాంగ్రెస్ ఆందోళన

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ ఇంటి వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న ఆయన నివాసం వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించాయి.

ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు “జ్ఞానేశ్ కుమార్ బీజేపీ నేత”, “ఓటు చోర్” అంటూ నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు, ఫలితాలపై అనుమానాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఈ ఆందోళన చేపట్టారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రతపై ప్రశ్నలు లేవనెత్తుతూ ఈ నిరసన కార్యక్రమం జరగడం గమనార్హం.

Read More : ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు

One thought on “యూపీలో సీఎస్‌ఈ ఇంటి వద్ద కాంగ్రెస్ ఆందోళన

Comments are closed.