కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) ఎన్నికల సంస్కరణలపై బీఆర్ఎస్ తమ అభిప్రాయాలను తెలియజేసింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ, ఈవీఎంలకు బదులుగా పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని తమ పార్టీ తరఫున ఈసీని కోరినట్లు తెలిపారు. ఎన్నికల్లో తీసుకురావాల్సిన సంస్కరణలు, ఇతర అంశాలపై ఈసీకి సమగ్రంగా వివరించామని కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు తమ సూచనలను పరిగణలోకి తీసుకోవాలని ఈసీని కోరినట్లు ఆయన చెప్పారు.
Share This

One thought on “ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్ వాడాలి”
Comments are closed.