బోరుగడ్డ అనిల్ విడుదల

బోరుగడ్డ అనిల్ జైలు నుంచి విడుదలయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై 50కి పైగా కేసులు నమోదైనట్లు సమాచారం. గత ఏడాది అక్టోబర్‌లో గుంటూరులో జరిగిన చర్చికి సంబంధించిన వివాదంలో బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం కోర్టులో హాజరుపర్చగా, కోర్టు రిమాండ్ విధించింది. అప్పటి నుండి అనిల్‌కు సంబంధించిన వివిధ కేసుల్లో పోలీసులు ఆయన్ను వివిధ కోర్టులకు హాజరుపరుస్తూ విచారణను కొనసాగించారు.

బోరుగడ్డ అనిల్‌పై గతంలోనూ అనేక కేసులు నమోదయ్యాయి. 2016లో పెదకాకానిలో జరిగిన ఓ సంఘటనలో సర్వేయర్ మల్లిఖార్జునరావును బెదిరించిన కేసులో గుంటూరు కోర్టులో విచారణ కొనసాగింది. ఈ కేసులో అనిల్‌కు తాజాగా బెయిల్ మంజూరు కావడంతో గుంటూరు జిల్లా జైలులో ఉండి వచ్చిన ఆయన విడుదలయ్యారు.

ఇటీవల అనేక చర్చలకూ, రాజకీయ దుమారానికీ కారణమైన ఈ కేసుల్లో అనిల్ విడుదలపై మరిన్ని చర్చలు మొదలయ్యాయి. ఆయనపై ఇంకా ఉన్న కేసుల విచారణ కొనసాగుతుండగా, ఈ బెయిల్‌తో కొన్ని నెలలుగా సాగిన అనిల్ జైలుశిక్షకు ముగింపు పలికింది.

Read More : పొదిలి ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు