బెట్టింగ్ యాప్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ విష్ణుప్రియ

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించిన కేసులో ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో తనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్‌లను రద్దు చేయాలని ఆమె హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ జరిపే అవకాశముంది.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బెట్టింగ్ యాప్‌ల వివాదంలో ఇప్పటికే పలువురు సినీ నటులు, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు అనుమానాస్పదంగా మారారు. విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీ తదితరులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. తాజాగా, యాంకర్ విష్ణుప్రియకు సంబంధించిన ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

బెటింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు భారీ డబ్బు తీసుకున్న విష్ణుప్రియ

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో యాంకర్ విష్ణుప్రియపై కేసు నమోదైంది. ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో 15 బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. విచారణ సందర్భంగా ఆమె ప్రమోషన్ కోసం భారీ మొత్తం తీసుకున్నట్లు అంగీకరించారని సమాచారం. ఈ నేపథ్యంలో, విచారణ నిమిత్తం నాలుగు రోజుల క్రితం పోలీసులు ఆమెను ప్రశ్నించి, ఫోన్‌ను సీజ్ చేశారు.

పోలీసుల విచారణలో కొత్త విషయాలు వెలుగు

పోలీసులు విష్ణుప్రియ బ్యాంక్ స్టేట్మెంట్‌ను కూడా పరిశీలించారు. విచారణకు పిలిస్తే అందుబాటులో ఉండాలని పంజాగుట్ట పోలీసులు ఆమెకు ఆదేశాలు ఇచ్చారు. ఇదే కేసులో మొత్తం 11 మందిని నిందితులుగా చేర్చారు. వారందరికీ పోలీసులు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేయగా, విచారణకు హాజరు కావాల్సిన ముగ్గురిలో కేవలం ఇద్దరే హాజరయ్యారు.

ఈ కేసు మరింత రాజకీయ, సినీ రంగాల్లో దుమారం రేపుతుందా? హైకోర్టు విచారణలో ఏవిధమైన తీర్పు వస్తుందన్నదానిపై అందరి దృష్టి ఉంది.

Read More : “ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ 357 వెబ్‌సైట్‌లు బ్లాక్, 2,400 బ్యాంకు ఖాతాలు జామ్ – బెట్టింగ్ యాప్స్‌పై దేశవ్యాప్తంగా చర్యలు”