రైతుల సమస్యలపై గన్‌పార్క్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నిరసన.

హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వినూత్నంగా నిరసన తెలిపారు. “గణపతి బప్పా మోరియా… రైతులకు కావాలి యూరియా” అంటూ నినాదాలు చేశారు. రైతుల సమస్యలు, ఎరువుల కొరతపై అసెంబ్లీలో చర్చ జరగాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, అసెంబ్లీని కేవలం నాలుగు రోజులు కాకుండా కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం సమగ్ర చర్చకు సిద్ధం కావాలని ఆయన హితవు పలికారు.

Read More : ప్రియుడితో కలసి భార్య ఘాతుకం

One thought on “రైతుల సమస్యలపై గన్‌పార్క్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నిరసన.

Comments are closed.