తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా త్వరలో జరగనున్న మిలాద్-ఉన్-నబీ పండుగ ఏర్పాట్లకు సంబంధించి పలు కీలక విజ్ఞప్తులతో కూడిన వినతిపత్రాన్ని సీఎంకు అందజేశారు.
మర్కజీ మిలాద్ జులూస్ కమిటీ సభ్యులతో కలిసి సీఎంను కలిసిన ఒవైసీ సోదరులు, పండుగ సందర్భంగా ప్రభుత్వం తరఫున సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా, హైదరాబాద్లోని ప్రాచీన మసీదులు, దర్గాలను విద్యుద్దీపాలతో అలంకరించేందుకు అవసరమైన విద్యుత్ను ఉచితంగా సరఫరా చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
అదనంగా, రాష్ట్రవ్యాప్తంగా మిలాద్-ఉన్-నబీ శోభాయాత్రలను శాంతియుతంగా నిర్వహించేందుకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కూడా కోరారు. కమిటీ సభ్యులు చేసిన విజ్ఞప్తులపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
Read More : శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద: 10 గేట్లు ఎత్తివేత.

2 thoughts on “మిలాద్-ఉన్-నబీ ఏర్పాట్లపై సీఎం రేవంత్తో ఒవైసీ సోదరుల భేటీ.”
Comments are closed.