79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు ఆకర్షణీయమైన ‘ఫ్రీడమ్ సేల్’ ఆఫర్ను ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై భారీ తగ్గింపును అందిస్తున్న ఈ సేల్లో భాగంగా, దేశీయ ప్రయాణానికి టికెట్ ధరలు కేవలం ₹1,279 నుంచి ప్రారంభమవుతున్నాయి. మొత్తం 50 లక్షల సీట్లు ఈ ప్రత్యేక ధరలకు అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద టికెట్ల బుకింగ్ ఆగస్టు 15 వరకు కొనసాగుతుంది. ఆగస్టు 10 నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వెబ్సైట్, మొబైల్ యాప్లో ప్రారంభమైన ఈ సేల్, ఆగస్టు 11 నుంచి అన్ని ప్రధాన బుకింగ్ ప్లాట్ఫార్మ్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్లో బుక్ చేసిన టికెట్లతో 2025 ఆగస్టు 19 నుంచి 2026 మార్చి 31 మధ్య ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. దీంతో ఓనం, దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి పండుగలకు ముందుగానే ప్రయాణ ప్రణాళికలు వేసుకునే సౌకర్యం లభిస్తుంది.
దేశీయ రూట్లలో టికెట్ ధరలు ₹1,279 నుంచి, అంతర్జాతీయ రూట్లలో ₹4,279 నుంచి ప్రారంభమవుతాయి. ప్రయాణికుల అవసరాలను బట్టి సంస్థ ‘ఎక్స్ప్రెస్ లైట్’ (క్యాబిన్ బ్యాగేజీతో జీరో చెక్-ఇన్ ఛార్జీలు), ‘ఎక్స్ప్రెస్ వ్యాల్యూ’ (దేశీయంగా ₹1,379 నుంచి, అంతర్జాతీయంగా ₹4,479 నుంచి), అలాగే ప్రీమియం సేవల కోసం ‘ఎక్స్ప్రెస్ బిజ్’ బిజినెస్ క్లాస్ ఆప్షన్లు అందిస్తోంది.
ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 116 విమానాలతో దేశీయంగా 38 గమ్యస్థానాలు, అంతర్జాతీయంగా 17 గమ్యస్థానాలకు రోజూ 500కిపైగా విమాన సర్వీసులు నడుపుతోంది. ఇటీవల సంస్థ 40కి పైగా కొత్త విమానాలను కొనుగోలు చేసి సేవలను విస్తరించింది.
Read More : కామెడీ ఖిలాడీగాలు ఫేమ్ చంద్రశేఖర్ సిద్ధి మృతి…

One thought on “ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ‘ఫ్రీడమ్ సేల్’ ఆఫర్”
Comments are closed.