ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శనివారం (జూన్ 8) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నట్లు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. మే 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలు రెండు సెషన్లలో నిర్వహించారు. ఉదయం సెషన్‌లో మొదటి సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం సెషన్‌లో రెండవ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు జరిగాయి.

ఫలితాలను చూసేందుకు విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్
👉 https://resultsbie.ap.gov.in/
విజిట్ చేయవచ్చు.

ఫలితాలు తెలుసుకునే విధానం:

  1. అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in/ కి వెళ్లాలి.
  2. హోమ్ పేజీలో ‘AP IPE Results 2025’ అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
  3. తరువాత ఇంటర్ 1st Year లేదా 2nd Year ఫలితాలను ఎంచుకోవాలి.
  4. లాగిన్ విండోలో హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేయాలి.
  5. ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు.

విద్యార్థులు తమ మార్క్‌షీట్లను భద్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Read More : చీనాబ్ రైల్వే వంతెన ప్రారంభంపై సీఎం ప్రశంసలు.

One thought on “ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

Comments are closed.