తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. రానున్న ఐదు రోజుల పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కోస్తా పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ద్రోణి ఈ 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, అనంతరం 36 గంటల్లో మరింత బలమైన వాయుగుండంగా మారుతుందని తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశమున్నది.
ఈరోజు, రేపు పశ్చిమ మరియు తూర్పు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలి గర్జించే అవకాశం ఉందని అంది.
అలాగే, తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పంటన్నట్టు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్, నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్బాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పిలుపునిచ్చారు.
Read More : అలిపిరి బాంబు దాడి సూత్రధారి నంబాల కేశవరావు హతం.

One thought on “తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు”
Comments are closed.