డీఎంకే ఎంపీ కదిర్‌ ఆనంద్‌ కళాశాలలో రూ.13.7 కోట్లు స్వాధీనం – ఈడీ తనిఖీలు

డీఎంకే ఎంపీ కదిర్‌ ఆనంద్‌(DMK MP Kadir Anand)కు చెందిన కళాశాలలో ఇటీవల జరిపిన తనిఖీల్లో రూ.13.7 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు వెల్లడించారు.

చెన్నై: డీఎంకే ఎంపీ కదిర్‌ ఆనంద్‌(DMK MP Kadir Anand)కు చెందిన ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈడీ అధికారులు రెండు రోజుల క్రితం తనిఖీలు చేపట్టారు. ఈ దర్యాప్తులో రూ.13.7 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తాజా సమాచారం అందింది. మంత్రి దురైమురుగన్‌ కుమారుడు, వేలూరు ఎంపీ కదిర్‌ ఆనంద్‌(Minister Duraimurugan’s son and Vellore MP Kadir Anand)తో పాటు, ఆయన ఇళ్లు, ముఖ్య అనుచరుడు పూంజోలై శ్రీనివాసన్‌ సోదరుడు, డీఎంకే ప్రముఖుడు, దామోదరనప్‌ వంటి అనేక మంది ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు.

మూడురోజులపాటు జరిగిన ఈ తనిఖీల్లో, డిజిటల్‌ నగదు పరివర్తన, కార్యాలయ ఫైళ్లు, కంప్యూటర్‌ సమాచారం, కళాశాలలో నగదు భద్రపరిచే గది సహా పలు ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు జరిపారు. అయితే, లభ్యమైన ఆధారాలు, పత్రాల గురించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎలాంటి వివరాలు విడుదల చేయలేదు.

తాజాగా, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తనిఖీల్లో లభ్యమైన విలువైన వస్తువులలో, కళాశాల నుండి రూ.13.7 కోట్లు, ఎంపీ కదిర్‌ ఆనంద్‌ ఇంటి లాకర్‌ నుండి రూ.75 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, కళాశాల నుంచి హార్డ్‌ డిస్క్‌ మరియు ఆస్తులకు సంబంధించిన పత్రాలు కూడా లభ్యమయ్యాయి. ఆ పత్రాలను పరిశీలించి, కంప్యూటర్‌లో నమోదుచేసిన వివరాలను కూడా పరిశీలిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.