ఏపీ లో వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రత్యేక డ్రైవ్ – ఇంటింటికీ అవగాహన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్‌లో నూతన పాలనాపద్ధతుల అమలుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ చొరవతో ప్రారంభమైన వాట్సాప్ గవర్నెన్స్ విధానం ప్రజల్లో మరింత ప్రాచుర్యం పొందేందుకు ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్‌కు రంగం సిద్ధం చేసింది.

ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాట్సాప్ గవర్నెన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించనుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి, ప్రజల మొబైల్ ఫోన్లలో ‘మన మిత్ర’ పేరిట 9552300009 నెంబరును సేవ్ చేయించనున్నారు. ఈ నంబర్ ద్వారా ప్రజలు ప్రభుత్వ సేవలు పొందగలుగుతారు.

ఈ డ్రైవ్‌ను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు. ప్రభుత్వ లక్ష్యం – ప్రతి ఒక్కరికి ఈ సేవలు అందుబాటులోకి తీసుకురావడం. ప్రస్తుతానికి వాట్సాప్ ద్వారా 250 పైగా సేవలు అందుబాటులో ఉండగా, జూన్ నాటికి ఆ సంఖ్యను 500కి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తుదకు ఈ సంఖ్యను 1000కు పెంచాలని నిర్ణయించింది.

ఈ కార్యక్రమం ద్వారా డిజిటల్ పాలనకు ప్రజల భాగస్వామ్యం మరింతగా పెరగనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read More : రాప్తాడు పర్యటనలో జగన్ హెలికాప్టర్‌కు నష్టం..

One thought on “ఏపీ లో వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రత్యేక డ్రైవ్ – ఇంటింటికీ అవగాహన కార్యక్రమం

Comments are closed.