బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా, కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూములపై చేపట్టనున్న చెట్లు, అడవులను తొలగించే ప్రతిపాదనపై స్పందించారు. ఈ విషయంలో ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి గారు, కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో ఉన్న చెట్లు, అడవిని తొలగించే ప్రతిపాదనను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక అభయారణ్యమే కాదు, మన నగరానికి జీవం పోసే శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ’’ అని ఆమె తెలిపారు.
ఈ అంశంపై ఇప్పటికే పలు ప్రముఖులు, రాజకీయ నేతలు, చిత్ర పరిశ్రమకి చెందిన వారు స్పందించారు. పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్, నటి దియా మీర్జా, నటుడు జాన్ అబ్రాహం, తెలుగు సినిమా సెలబ్రిటీస్ సైతం ఈ విషయం మీద ఆందోళన ప్రదర్శించారు. సమాజంపై పర్యావరణ ప్రభావం గురించి అవగాహన పెంచేందుకు వారి తరహాలో ఊర్వశీ రౌతేలా కూడా సమాజంపై పర్యావరణ ప్రభావం గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
ఇటీవల విడుదలైన ‘డాకు మహారాజ్’ సినిమాతో ఊర్వశీ రౌతేలా తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఇందులో ఆమె కీలక పాత్రలో కనిపించారు. అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ఐటెం సాంగ్తో కూడా ఆమె మెప్పించారు.
Dear and Respected Chief Minister @revanth_anumula Garu, I humbly plead with you to reconsider the proposal to clear 400 acres of precious trees and forest in Kancha Gachibowli. This vibrant ecosystem is not just a vital green sanctuary for our city, breathing life into
— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) April 7, 2025

One thought on “ఉర్వశీ రౌతేలా: గచ్చిబౌలిలో చెట్లను కాపాడేలా సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి”
Comments are closed.