అమెరికాలో ఎన్నికల నిర్వహణ విధానంలో కీలక మార్పులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నడుం బిగించారు. ఇందులో భాగంగా, ఓటింగ్ వ్యవస్థలో గణనీయమైన మార్పులను కోరుతూ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. తాజా ఆదేశాల ప్రకారం, ఓటర్లు తమ అమెరికన్ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాదు, ఎన్నికల రోజు నాటికి అందిన మెయిల్-ఇన్ (Mail-in) మరియు గైర్హాజరీ (Absentee) బ్యాలెట్లను మాత్రమే లెక్కించాలని కొత్త ఆదేశాలు పేర్కొన్నాయి. అలాగే, అమెరికా పౌరులైతేనే ఎన్నికల విరాళాలు అందించగలిగేలా నియంత్రణ విధించారు.
ఇదే సందర్భంలో, ట్రంప్ భారతదేశం, బ్రెజిల్లలో అమలవుతున్న ఎన్నికల విధానాలను ప్రస్తావించారు. అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రాథమిక ఎన్నికల రక్షణ విధానాలు ఉన్నప్పటికీ, అమెరికా మాత్రం ఓటరు గుర్తింపు విషయంలో వెనుకబడి ఉందని వ్యాఖ్యానించారు. భారత్, బ్రెజిల్ దేశాలు ఓటర్ల గుర్తింపును బయోమెట్రిక్ డేటాబేస్కి అనుసంధానించినప్పటికీ, అమెరికా మాత్రం ఇప్పటికీ స్వీయ ధ్రువీకరణ (Self-certification) విధానాన్ని నమ్ముకొస్తోందని ట్రంప్ విమర్శించారు.
అంతేకాదు, బ్యాలెట్ ప్రాసెసింగ్లో అమలవుతున్న అనిశ్చిత విధానంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఎలాంటి మోసం, లోపాలు, అనుమానాలు లేకుండా స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, నిజాయతీ గల ఎన్నికల విధానం అవసరమని, ఇది రాజ్యాంగ గణతంత్రాన్ని కాపాడేందుకు కీలకమని ట్రంప్ స్పష్టం చేశారు.
Read More : భారత్, ట్రంప్ ప్రతిస్పందన రుసుముల నుండి మినహాయింపు కోరనున్నది

One thought on “అమెరికా ఎన్నికల విధానంలో మార్పులు – ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం”
Comments are closed.